SRCL: వేములవాడ పట్టణం 21వ వార్డులో సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి కూడు, గూడు సమస్య లేకుండా చూడడమే లక్ష్యంగా పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని వేగంగా ప్రారంభించాలన్నారు.