KRNL: చిప్పగిరి మండల కేంద్రంలో సోమవారం వైసీపీ కార్యకర్త బర్మే గోవిందు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే గ్రామానికి చేరుకుని విరుపాక్షి పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.