AP: గుంటూరు జిల్లాలోని మంగళగిరి సాక్షి కార్యాలయం ఎదుట అమరావతి మహిళా రైతులు ఆందోళనకు దిగారు. భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సాక్షి కార్యాలయంలోకి వెళ్లేందుకు రాజధాని రైతులు ప్రయత్నం చేశారు. మహిళలు లోపలికి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.