NLR: సీతారాంపురం పట్టణంలో బెస్త కాలనీలో ఇళ్ల మధ్యలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. విద్యుత్ అధికారులు ఎన్నోసార్లు ఈ మార్గంలో వెళ్తూ గమనించినప్పటికీ పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లలు తిరుగుతూ ఆటలాడుకుంటూ ఉంటారని ఇలా విద్యుత్ వైర్లు కిందకు వేలాడడం చాలా ప్రమాదకరమని అంటున్నారు.