NZB: ముప్కాల్ మండలం ముదక్పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి, ప్రేమ్ లాల్ ముదక్ పల్లిలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లదండ్రులకు అవగాహన కల్పించారు. సర్కారు బడుల్లో అందుతున్న సౌకర్యాల గురించి వివరించారు.