ATP: గుంతకల్లు వాల్మీకి నగర్లో సోమవారం రూ.10 లక్షలతో నూతన కళ్యాణమండపం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్ములూరు జయరాం, మున్సిపల్ చైర్మన్ భవాని హాజరయ్యారు. నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అలాగే రూ.3 లక్షలతో నూతన పైప్లైన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.