ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మోకాసిగూడలో సోమవారం ఆదివాసీ తుడుందెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక్ విజయ్ నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. టైగర్ కారిడార్ పేరిట జీవో నెం.49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపడుతామని పేర్కొన్నారు.