ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శంభుగూడ, ఘన్పూర్ గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన సెడ్మాకి ఫూలాజీ, శశికళ కుటుంబ సభ్యులను ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పరామర్శించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పటేళ్లు ఉన్నారు.