SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో బడి ఈడు పిల్లలందరినీ చేర్పించాలని ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకట్ రామనర్సమ్మ అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండలం వెంపటిలో నిర్వహించిన బడిబాటలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల నందు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన విద్య అందిస్తున్నారని, పిల్లల తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు.