ప్రకాశం: జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు గ్రామంలో ఆదివారం నాగార్పమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.