AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మణిపాల్ స్కూల్ వెనుక విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. వారం ముందు విద్యార్థిని అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కాగా వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.