మెదక్ మండలం మాచవరంలో ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. సొంగ లక్ష్మయ్య, అంజమ్మల కుమారుడు సొంగ కుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ వ్యవసాయ పనుల నిమిత్తం వారు వెళ్లగా ఇల్లుకు నిప్పంటుకున్న సంగతి తెలిసి ఇంటికి వచ్చే సరికి మొత్తం కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ.3.70 లక్షలు, పాస్ బుక్స్, 40 తులాల వెండి, సామాగ్రి పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు.