ADB: పేదింటి కలలను సాకారం చేస్తున్నామని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటిని అందజేస్తామన్నారు.