NRML: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిమగ్నమైన ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని, బాధ్యతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు.