SKLM: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం సెవెన్ రోడ్, ఎన్టీఆర్ మున్సిపల్ ప్రాంగణంలో బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కూటమి సూపరి పాలనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం జరపడం హాస్యాస్పదమని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు.