కోనసీమ: మండల కేంద్రమైన అయినవిల్లిలో వేంచేసియున్న విఘ్నేశ్వర స్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారికి సమర్పించిన వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ. 2,83,415ఆదాయం లభించినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.