AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో రావణాపల్లి రిజర్వాయర్కు సంబంధించి మూలప్ప చెరువుకు వెళ్లే కాలువలో జంగిల్ క్లియరెన్స్ పనులను బుధవారం ప్రారంభించారు. రావణాపల్లి రిజర్వాయర్ ఛైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, వైస్ ఛైర్మన్ నాగులపల్లి గోవింద మాట్లాడుతూ.. ఈ జంగిల్ క్లియరెన్స్ పనులకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను మంజూరు చేయించారన్నారు.