కోనసీమ: మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు బుధవారం తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం వైసీపీ కార్యాలయం వద్ద నిర్వహించారు. రావులపాలెం వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రావులపాలెం తహశీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.