MNCL: జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడా ప్రభుత్వ పాఠశాలలో 32 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ప్రభుత్వం జూన్ 6 నుంచి బడిబాటను ప్రారంభించనున్నది. అంతకు ముందుగానే పలు కాలనీలకు చెందిన 32 మంది విద్యార్థులు పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ సమక్షంలో అడ్మిషన్లు తీసుకున్నారు. మంచి విద్యా బోధన, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు వస్తున్నారన్నారు.