KRNL: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే16న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పి.సోమ శివరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హత గల నిరుద్యోగులు విద్యార్హతల ధ్రువపత్రాలు, ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.