SRD: ప్రతి విద్యార్థికి పాఠశాల ప్రారంభం జూన్ 12వ తేదీన పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఆర్జేడి విజయలక్ష్మి సూచించారు. డీఈవో కార్యాలయంలోని పుస్తక కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. మండలాలకు పుస్తకాల పంపిణీ త్వరగా ప్రారంభించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.