ATP: కళ్యాణదుర్గం పట్టణ శివారులోని సదొడగట్ట హైవేపై బుధవారం కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.