శ్రీలంకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.