ప్రకాశం: కనిగిరి మండలం చాకిరాలలోని రామలింగేశ్వరస్వామి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన కందులు, శెనగలు కొనుగోలు కేంద్రాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.