W.G: వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని మంగళవారం మొగల్తూరు గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. మొగల్తూరు నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న వక్ఫ్ బోర్డు భూములలో పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.