జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించాడు. ఆ దాడిని తీవ్రంగా ఖండించాడు. ఈ ఉగ్రదాడి విషయంలో కశ్మీర్ వాసులు ఎంతో బాధపడుతున్నారన్నాడు. ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కాగా, ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.