TG: సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. 5 రోజుల క్రితమే వీణ(60), మీనా(59) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.