SRD: ప్రముఖ సంఘ సంస్కర్త, వాగ్గేయకారుడు స్వచ్ఛ భారత్ పితమహుడు సంత్ గాడ్గే బాబా 150వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం ఐలమ్మ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు.