BHPL: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులు భారీగా పెరిగారు. భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేస్తున్నారు. పార్వతి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి, నవగ్రహ కాలసర్ప పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు.