సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువల ద్వారా 193చెరువులు, 2రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపాలని మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. గురువారం సచివాలయంలో మంత్రిని కలిసిన ఆయన, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని తెలిపారు. వీటి పెంపుదల కోసం తగిన నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.