KMM: తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో వరి గడ్డి వాము దగ్ధమైంది. గ్రామంలోని సొసైటీ బజారులో ఉన్న, కర్నాటి దుర్గకు చెందిన నాలుగు ఎకరాలకు చెందిన వరిగడ్డిని వాము వేసి ఉంచారు. దానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయిందని బాధితురాలు వాపోయారు. దీంతో పశువులకు మేత లేకుండా పోయిందని, రూ.40వేల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.