SRD: మాఘమాసం మొదటి గురువారం పురస్కరించుకొని హత్నూర మండలం మధురలోని దత్త చల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దత్త నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.