MDK: మాజీ ముఖ్య మంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావును నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పలకరించి నియోజకవర్గ పరిస్థితులపై ఆరాతీశారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉన్నారు.