E.G: కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్న పలు అభివృద్ధి పనులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. పాఠశాలలో HDBFS- WASHI వారి ప్రోత్సాహంతో రూ. 17 లక్షల అంచనాలతో డైనింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనాలు పరిశీలించి విధ్యార్ధులతో ముచ్చటించారు.