W.G: అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు స్పష్టం చేశారు. సోమవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో అంగన్వాడీల్లో 70 శాతం ఉన్న హాజరు, ప్రస్తుత ప్రభుత్వ చొరవతో 90 శాతానికి పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.