కోనసీమ: విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సరఫరా చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా సీఈఓ లక్ష్మణ్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం సీఈవోకు ఎమ్మెల్సీ లేఖ రాశారు. విద్యార్థులకు తక్షణమే స్టడీ మెటీరియల్ అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.