JGL: మెట్పల్లి పట్టణంలోని శ్రీ వాణి నికేతన్ హై స్కూల్లో, 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 37 ఏళ్ల తర్వాత, బాల్య మిత్రులందరు, కలుసుకొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరికి ఒకరు మంచి చెడులను, తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. అపూర్వ సమ్మేళనం ఆవిష్కృతమైందన్నారు.