BHNG: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంగళవారం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ.. క్రైస్తవులకు పరమ పవిత్రమైందన్నారు. క్రీస్తుబోధనలు ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరుకున్నారు.