MNCL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో మంగళవారం బీసీ, బహుజన సంఘాల ఆధ్వర్యంలో పెరియార్ 51వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెరియార్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాజం కోసం తన జీవితాంతం పోరాడిన ఉద్యమ జీవి పెరియార్ అని కొనియాడారు.