HYD: ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొత్తం 160 మందికి మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్.