SRCL: జిల్లాలోని రైతుల సంఖ్యకు అనుగుణంగా, నూతన పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు)లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకం సహకార్ సే సమృద్ధిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.