సిద్దిపేట: తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఇల్లు లేని ప్రతి ఎరుకల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు కుమారస్వామి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.