WNP: వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో హక్కులపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ విధానం ద్వారా ఫిర్యాదులు చేసి వినియోగదారులు సత్వర న్యాయం పొందవచ్చునని ఆయన సూచించారు.