SRD: పటాన్ చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్వహకులు, గ్రామస్తులు ఉన్నారు.