మహబూబ్ నగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. అమ్మాయిపల్లి గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు తరలించాలన్నారు.