GDL: క్రిస్మస్ పర్వదిన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అయిజ ఎస్ఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం పీఎస్లో మీడియాతో మాట్లాడుతూ.. క్రిస్టియన్ సోదరులు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రార్థన సమయంలో సమన్వయం పాటించి సమాజంలో శాంతి నెలకొల్పాలన్నారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.