MDK: తూప్రాన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. యువతి(19) గజ్వేల్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. నిన్న కళాశాలలో పరీక్ష ఉందంటూ వెళ్లి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.