MHGR: సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని రాచకొండలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి 5వ వార్షిక కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు ఈనెల 26న గురువారం జరగనున్నాయని రాజప్ప కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానపత్రిక అందజేసి ఆహ్వానించారు. రాచప్ప కమిటీ సభ్యులు బద్దుల కృష్ణకుమార్, నాయకులు ఉప్పల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.