NZB: ఆర్మూర్ ఇన్నాళ్లు ఊరించిన పసుపు బోర్డు విషయం ఏమైందని ఎంపీ అర్వింద్ను విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మన్ సుంకేట్ అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు ప్రకటన.. పాలాభిషేకానికే పరిమితమైందన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ ఛైర్మన్ జీవన్, నాయకులు పాల్గొన్నారు.