NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళ వారం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే పనులు త్వరగా పూర్తిచేసి ఆన్ లైన్లో పొందుపరచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్, ఎంపీడీవో ప్రకాశ్, అధికారులు ఉన్నారు.